కాంగ్రెస్ లో చేరిన మరో భరాస ఎమ్మెల్యే

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తెలంగాణలో కాంగ్రెస్‌(congress)లోకి బీఆర్‌ఎస్(BRS) ఎమ్మెల్యేల వలసల పర్వం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆ పార్టీకి చెందిన జగిత్యాల బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సంజయ్ కుమార్(Sanjay Kumar) అధికార పార్టీలోకి జంప్ అయ్యారు. ఆదివారం రాత్రి జూబ్లీహిల్స్‌లో ముఖ్యమంత్రి నివాసానికి చేరుకుని ఎ. రేవంత్ రెడ్డి(revanth reddy) సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా సంజయ్‌కుమార్‌కు టీపీసీసీ చీఫ్‌, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కండువా కప్పు కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.