లబ్ధిదారులకు నేడు చెక్కులు పంపిణీ చేయనున్న శాసనసభ స్పీకర్

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:

తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి గురువారం నాడు బాన్సువాడ నియోజకవర్గం పరిధి బాన్సువాడ మండలంలోని కోనాపూర్, హన్మాజీపేట, సంగోజీపేట, కాదలాపూర్, పులిగుండు తాండ, సోమ్లనాయక్ తాండ గ్రామాలలో పలువురు లబ్ధిదారులు తమ సొంత స్థలాల్లో నిర్మించుకున్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు గాను ప్రభుత్వం ద్వారా మంజూరైన చెక్కులను మండలంలోని కోనాపూర్ గ్రామంలో గల రైతు వేదిక భవనంలో మధ్యాహ్నం 12 గంటలకు లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. అదేవిధంగా ఉదయం 10:30 గంటలకు వర్ని మండల పరిధిలోని శ్యామ్ రావు తండా మధ్యాహ్నం రెండు గంటలకు అంతాపూర్ గ్రామాల్లో లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయనున్నారు

Leave A Reply

Your email address will not be published.