మాజీ ఎంపీటీసీ దారుణ హత్య

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: హైదరాబాద్ శివారు మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. ఓ మాజీ ప్రజాప్రతినిధి దారుణ హత్యకు గురయ్యాడు. మాజీ ఎంపీటీసీ గడ్డం మహేష్ డంపింగ్ యార్డ్‌లో శవమై తేలాడు. ఈ నెల 17న ఇంటి నుంచి బయటకు వెళ్లిన మహేష్ ఆ తర్వాత ఇంటికి రాలేదు. దీంతో ఆయన సోదరుడు విఠల్ ఘట్కేసర్ పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వివిధ కోణాల్లో విచారణ చేపట్టారు.

అనుమానాస్పద వ్యక్తులను అదుపులోకి తీసుకొని విచారించగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ప్రధాన నిందిలు పరమేష్, చిన్నా అనే యువకులు వెల్లడించిన ఆధారంగా ఘట్కేసర్ పరిసరాల్లోని డంపింగ్ యార్డ్‌లో మృతదేహాన్ని పాతిపెట్టినట్లు తెలిసింది. దీంతో జేసీబీ సాయంతో మృతదేహాన్ని బయటకు తీశారు. హత్యకు ముందు మహేష్‌ను ఓ గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేసినట్లు తేలింది. చిన్నా, పరమేష్‌లతో పాటు మరో నలుగురు ఈ హత్యలో పాల్గొన్నట్లు తెలిసింది. వివాహేతర సంబంధం, ఆర్థికలావాదేవీలతో మహేష్‌ను పాశవికంగా హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.