ఎమ్మెల్యేలపై అనర్హత వేడివేయాలని స్పీకర్ కు ఫిర్యాదు చేసిన టిఆర్ఎస్

తెలంగాణజ్యోతి వెబ్ న్యూస్:  బాన్సువాడ ఎమ్మెల్యే  శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్‌పై బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. స్పీకర్‌కు ఫోన్ చేసిన స్పందించకపోవడంతో ఆయన ఈ-మెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా వారిపై ఫిర్యాదు చేశారు. వారు గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి… ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో జగదీశ్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పార్టీ మారిన ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్, శాసన సభ సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. ఇదివరకు పార్టీ మారిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై కూడా ఫిర్యాదు చేశారు. జ్యోతి

Leave A Reply

Your email address will not be published.