కమలం గుర్తు ఓటర్లు మర్చిపోకుండా

.. జీవిత రాజశేఖర్ వినూత్న ప్రచారం

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్ : మునుగోడులో ఉప ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ప్రధాన పార్టీలన్నీ హేమాహేమీలను రంగంలోకి దించి ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నాయి. స్టార్ క్యాంపెయినర్ ల ప్రచారంతో మునుగోడు నియోజకవర్గంలో ఎన్నికల సందడి కొనసాగుతుంది. ఇక బీజేపీ ఎన్నికల ప్రచారంలో బీజేపీ కీలక నాయకులు రంగంలోకి దిగారు. ఇప్పటికే బండి సంజయ్ ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తుండగా, ఎన్నికల ప్రచార రంగంలోకి దిగిన కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్, డీకే అరుణ, బాబు మోహన్, జీవిత రాజశేఖర్, ధర్మపురి అరవింద్ తదితరులు ఉత్సాహంగా ప్రచారం చేస్తున్నారు. మునుగోడు నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న జీవితారాజశేఖర్ వినూత్నంగా తన ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్నారు. ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కి మద్దతుగా ఎన్నికల ప్రచారాన్ని సాగిస్తున్న బిజెపి నేత సినీ నటి జీవిత రాజశేఖర్ చౌటుప్పల్ మండలం లో బిజెపికి ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను వినూత్నంగా అభ్యర్థించారు. యాదాద్రి భువనగిరి జిల్లా, మునుగోడు నియోజకవర్గం, చౌటుప్పల్ మండలం లోని దేవలమ్మ నాగారం గ్రామంలో మునుగోడు బిజెపి అభ్యర్థి కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం నిర్వహించిన జీవిత రాజశేఖర్ ఇంటింటికి వెళ్లి ఓటర్ల చేతికి కోన్ తో గోరింటాకు పెట్టిస్తూ, వారి చేతుల పై కమలం గుర్తును వేయిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.