ఢిల్లీ విమానాశ్రయంలో ప్రమాదం ఒకరు మృతి
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: వేకువ జామున కురిసిన గాలి వానకు ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1లో పైకప్పు కూలింది. ఈ దుర్ఘటనలో ఒకరు మృతి చెందగా, ఆరుగురికి గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే రిస్క్యూ టీం ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టింది.
ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ అధికారి ఒకరు మాట్లాడుతూ… ఢిల్లీ విమానాశ్రయంలోని టెర్మినల్-1 పైకప్పు కూలిపోయిందనే సమాచార తమకు వేకువజామున ఐదున్నరకు అందిందని తెలిపారు. విషయం తెలుకున్న వెంటనే మూడు అగ్నిమాపక యంత్రాలతో ఘటనాస్థలానికి సిబ్బందితో చేరుకున్నట్టు వెల్లడించారు. మొదట నలుగుర్ని రెస్క్యూ చేశామని తర్వాత శిథిలాల కింద మరో ఇద్దర్ని గుర్తించి బయటకు తీసినట్టు వివరించారు. అదే టైంలో ఒకరు మృతి చెందినట్టు కూడా గుర్తించామని పేర్కొన్నావారు.
“ఈ ఉదయం 5.30 గంటలకు ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని టెర్మినల్-1లో పైకప్పు కూలిపోయినట్లు అగ్నిమాపక శాఖకు ఫోన్ వచ్చింది. సమాచారం అందుకున్న వెంటనే మూడు అగ్నిమాపక దళానికి చెందిన వాహనాలను సంఘటనా స్థలానికి పంపించాం. ఇప్పటి వరకు గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించాం. ఒక వ్యక్తిని మాత్రం రక్షించడానికి చాలా సమయం పట్టింది.