కాంగ్రెస్ పార్టీకి డిఎస్ ఎనలేని సేవలందించారు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: విద్యార్థి నాయకుడి స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన గొప్ప వ్యక్తి ధర్మపురి శ్రీనివాస్ (డీఎస్ ) అని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అన్నారు. ఆదివారం నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్(D. Srinivas) భౌతికయానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు (Tribute). కుటుంబ సభ్యులను ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పీసీసీ అధ్యక్షుడుగా 2004లో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి డీఎస్ ఎంతో కృషి చేశారు.

2009లోనూ డీఎస్ సారధ్యంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చిందని గుర్తు చేశారు. పదవులపై తనకు ఎప్పుడూ ఆశ లేదని డీఎస్ అనేవారు. డీఎస్ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సేవ చేశారన్నారు. ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అండగా నిలబడుతుందని చెప్పారు. కుటుంబ సభ్యులతో చర్చించి డీఎస్ జ్ఞాపకార్ధం ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటాం. డీఎస్ మరణం కాంగ్రెస్ పార్టీకి తీరని లోటన్నారు. కాగా, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్‌ (75) కన్నుమూశారు.

Leave A Reply

Your email address will not be published.