ఎమ్మెల్యేను అరెస్టు చేసిన పోలీసులు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: నిరుద్యోగుల సమస్యపై ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న మోతీలాల్ నాయక్‌ను పరామర్శించేందుకు బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డితో కలిసి గాంధీ హాస్పిటల్ వద్దకు పల్లా రాజేశ్వర్ రెడ్డి వెళ్లగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఆస్పత్రి లోపలికి వెళ్లకుండా ఆపేయటంతో.. వెలువలే మీడియాతో మాట్లాడుతుండగా.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే.. వెనుక నుంచి వచ్చి.. రాకేశ్ రెడ్డిని, పల్లా రాజేశ్వర్ రెడ్డిని లాక్కెళ్లి.. పోలీసు వాహ‌నాల‌ను ఎక్కించారు. ప‌ల్లా రాజేశ్వర్ రెడ్డిని బొల్లారం పోలీసు స్టేష‌న్‌కు త‌ర‌లించారు.

Leave A Reply

Your email address will not be published.