ఇకమీదట ఒకటవ తేదీన ఇంటి వద్దకే పింఛన్లు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఇకపై ప్రతినెలా 1వ తేదీన లబ్ధిదారుల ఇంటి వద్దకే పింఛన్లను పంపిణీ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శ్రీకారం చుట్టారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ తెలిపారు. జక్కంపూడి కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ సృజనతో కలిసి ఆయన పాల్గొన్నారు. కలెక్టర్కు శాలువా కప్పి పుష్పగుచ్చాన్ని అంద జేసి శుభాకాంక్షలు తెలిపారు. లబ్ధిదారులకు రూ.7 వేలు చొప్పున పింఛన్ అందజేశారు.