ఓకే వేదికపై సోనియా, రాహుల్, విజయమ్మ

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఒకే వేదికపై సోనియా, రాహుల్ఏ, విజయమ్మ పీలో ఒకప్పుడు కాంగ్రెస్ ఎంపీగా ఉంటూ, వైఎస్సార్ మరణం తర్వాత ఆ పార్టీతో విభేదించి వేరు కుంపటి పెట్టుకుని అదే పార్టీని నామరూపాల్లేకుండా చేసేసిన వైఎస్ జగన్ సోదరి వైఎస్ షర్మిల ఇప్పుడు తండ్రి వైఎస్సార్ జయంతి వేడుకలకు సిద్ధమవుతున్నవారు. అంతే కాదు ఒకప్పుడు తన సోదరుడు వైఎస్ జగన్ ను, తల్లి విజయమ్మను అవమానించి పంపిన కాంగ్రెస్ పెద్దలను ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. దీంతో విజయమ్మ ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలతో వేదిక పంచుకోవాల్సిన పరిస్ధితి.

ఈ నెల 8న వైఎస్సార్ జయంతి వేడుకలను విజయవాడలో అట్టహాసంగా నిర్వహించేందుకు వైఎస్ షర్మిల సిద్ధమయ్యారు. అయితే పీసీసీ అధ్యక్షురాలి హోదాలో ఉంటూ దీన్ని తన సొంత కార్యక్రమంలా నిర్వహిస్తున్నారనే విమర్శలు ఎదుర్కొంటున్న షర్మిల.. ఇవేవీ పట్టించుకోకుండా సోనియా, రాహుల్, సిద్ధరామయ్య, ఖర్గే సహా కాంగ్రెస్ పెద్దలందరినీ దీనికి ఆహ్వానించారు. వైఎస్సార్ బిడ్డగా తాను చేపడుతున్న ఈ కార్యక్రమం ద్వారా పార్టీకి ఊపిరిలూదేందుకు షర్మిల ప్రయత్నిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.