పెద్ద అంబర్‌పేట సమీపంలో కాల్పుల కలకలం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: హైదరాబాద్ శివారు పెద్ద అంబర్‌పేట సమీపంలో కాల్పులు కలకలంరేపాయి. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర దోపిడీలకు పాల్పడుతున్న పార్థి గ్యాంగ్‌ను ఛేజ్ చేసిన పోలీసులు.. వారిని పట్టుకునే క్రమంలో గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ గ్యాంగ్‌లోని వాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్ఠి గ్యాంగ్ కొంతకాలంగా జాతీయ రహదారిపై పార్కింగ్ వాహనాలను టార్గెట్ చేస్తోంది. వరుస దొంగతనాలతో నల్గొండ జిల్లా పోలీసులు నిఘా పెంచారు.. ఎస్పీ శరత్ స్పెషల్ టీమ్‌లను రంగంలోకి దించారు.

ఈ క్రమంలో శుక్రవారం తెల్లవారుజామున హైవేపై ఈ దొంగల ముఠా పెట్రోలింగ్‌ పోలీసుల కంటపడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు.. వారిని వెంబడించారు. ఇలా ఆ గ్యాంగ్‌ను వెంటాడుతూ వస్తూ.. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలోకి వచ్చాక స్థానిక పోలీసుల్ని అప్రమత్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.