సమావేశమైన బాన్సువాడ ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బాన్సువాడ మండల ఫోటోగ్రాఫర్స్ యూనియన్ సభ్యులు శనివారం యూనియన్ అధ్యక్షుడు గోవర్ధన్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా అధ్యక్షులు గోవర్ధన్ మాట్లాడుతూ యూనియన్ బలోపేతానికి అందరు సభ్యులు కృషి చేయాలని, కుటుంబ భరోసా పథకం లో అందరు సభ్యులు చేరాలని, ఈ పథకం ద్వారా చనిపోయిన ప్రతి ఫోటోగ్రాఫర్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందుతుందని పేర్కొన్నారు. ఫొటో అండ్ వీడియోగ్రఫర్ సమస్యల పరిష్కారానికి అందరూ సభ్యులు ఐకమత్యం తొ కలసిగట్టుగా పని చేయాలని సూచించారు. అనంతరం సభ్యులకు బాన్సువాడ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అసోసియేషన్ ఐడెంటిటీ కార్డు లు అందజేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు డి.మధుసూదన్, కే.గంగాధర్,   అధ్యక్షుడు డి.గోవర్ధన్, ఉపాధ్యక్షుడు ఎండి ఫయాజొద్దీన్,   ప్రధాన కార్యదర్శి కొండా చంద్రశేఖర్, ఉప కార్యదర్శి పి.సాయిలు, కోశాధికారి వెంకటేష్ రత్నం , ఫొటోగ్రాఫర్లు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.