టిడిపి నేతపై కానిస్టేబుల్ దాడి
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: చీరాలలో బాలూ యాదవ్ అనే కానిస్టేబుల్ ఏకంగా టీడీపీ పార్టీ కార్యాలయంలోకి ప్రవేశించి సీనియర్ నేత నక్కల రమణారావుపై దాడి చేయడంపై అధిష్ఠానం ఆరా తీస్తుంది. ఎవరీ బాలూయాదవ్.. అతడికి ఎందుకు నేతలు ప్రాధాన్యం ఇస్తున్నారని ప్రజలు చర్చించుకుంటున్నారు. టీడీపీలోని మిగిలిన నేతలకు కూడా ఈ బాలు విషయం అంతుబట్టడంలేదు. టీడీపీ కార్యాలయంలో మూడు రోజుల క్రితం రమణారావుపై బాలు అనే కానిస్టేబుల్, మరో ఆరుగురుతో కలిసి దాడి చేయడం సంచలనంగా మారింది. సాక్షాత్తు టీడీపీ కార్యాలయంలో సీనియర్ నేతపైనే దాడి చేయడం దేనికి సంకేతమని ప్రజల్లో జోరుగా చర్చ సాగుతోంది.