తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కాకతీయ యూనివర్సిటీలో అర్థకాకతీయ యూనివర్సిటీలో అర్థరాత్రి కలకలం రేపింది. పోతన మహిళా హాస్టల్లో స్లాబ్ పెచ్చులూడింది. విద్యార్థినిలకు తృటిలో ప్రమాదం తప్పింది. అర్థరాత్రి విద్యార్థినులు రోడ్డెక్కారు. పోతన హాస్టల్ ఎదుట నిరసనకు దిగారు. విద్యార్థినులకు రిజిస్ట్రార్ మల్లారెడ్డి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విద్యార్థినులు రిజిస్ట్రార్ను బంధించే యత్నం చేశారు. తెల్లవారే వరకూ విద్యార్థినుల నిరసన కొనసాగింది. ఇటీవలే ఫ్యాన్ ఊడిపడి విద్యార్థిని తలకు తీవ్ర గాయమైంది. గతంలో ఎలుకలు కొరికి ఓ విద్యార్థినికి గాయాలయ్యాయి. వర్సీటీ హాస్టళ్లలో అపరిశుభ్రం నెలకొనడంతో చుట్టుపక్క ప్రాంతాల నుండి పాములు, కుక్కలు స్వైర విహారం చేశాయి.