ముఖేష్ అంబానీ కుమారుడి వివాహానికి హాజరుకానున్న ఏపీ సీఎం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు  నేడు శనివారం పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం ముఖేష్ అంబానీ కుమారుడి వివాహానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం కొలనుకొండ హరే కృష్ణ గోకుల్ క్షేత్రానికి వెళ్లనున్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో జరగనున్న అనంత శేష స్థాపన కార్యక్రమంలో పాల్గొన్ననున్నారు. అనంతరం టీడీపీ కేంద్ర కార్యాలయానికి చంద్రబాబు వెళ్లనున్నారు. ప్రజల నుంచి వచ్చే వినతలను చంద్రబాబు స్వీకరించనున్నారు.

Leave A Reply

Your email address will not be published.