అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు అహ్వానం 

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బీర్కూర్ మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్, ఫిజిక్స్, కామర్స్ సబ్జెక్టులను బోధించుటకు అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ మామిళ్ల మోహన్ రెడ్డి తెలిపారు. సంబంధిత సబ్జెక్ట్ లో పీ.జీ లో కనీసం 50%. మార్కులు కలిగి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. తేది అక్టోబర్ 28 లోపు ఆసక్తిగల అభ్యర్థులు కళాశాలలో ధరఖాస్తులను అందచేయాలని పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.