పారిశుద్ధ్య నిర్మూలన చర్యలేవి?
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా నసురుళ్లబాద్ మండలం మైలారం గ్రామంలో గ్రామ పంచాయతీ సెక్రటరీ గధులకు తాళం వేసి గ్రామ సమస్యలను తుంగలో తొక్కుతున్నారనీ బిజెపి మండల శాఖ ఆరోపించింది. గ్రామంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇప్పటివరకు దోమల మందు కానీ బ్లీచింగ్ పౌడర్ కానీ డ్రైనేజీలు క్లినింగ్ కానీ పట్టించు కునే నాధుడే కరువయ్యారని వారు ఆరోపించారు. గ్రామ సమస్యలను పట్టించుకోని పంచాయతీ కార్యదర్శి పై మండల అభివృద్ధి అధికారి శాఖ పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.