తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్‌గా మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్ సింగ్‌ నియామకం అయ్యారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ నిర్ణయం తీసుకుంది. రోహిత్‌ సింగ్‌ను ఆర్‌వోగా నియమిస్తూ ఎన్నికల కమిషన్ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత ఆర్‌వో జగన్నాథ రావు స్థానంలో రోహిత్ సింగ్‌కు బాధ్యతలు అప్పగించారు. స్వతంత్ర అభ్యర్థులకు గుర్తులు కేటాయించే అంశంలో జగన్నాథ రావుపై వేటు పడిన సంగతి తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.