నేడు హైదరాబాద్ లో పర్యటించనున్న పార్లమెంట్ వ్యవహారాల శాఖ మంత్రి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:
పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహల్లాద్ జోషి నశుక్రవారం లోక్ సభ ప్రవాస్ యోజన లో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటించనున్నారు.
ఇందులో భాగంగా ఆయన దిల్ సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ ఉదయం తొమ్మిది గంటలకు దర్శించుకోనున్నారు.
ఉదయం 9:30 గంటలకు మలక్ పేట్ శాసనసభ నియోజకవర్గ కార్యాలయాన్ని ప్రారంభించనున్నారు. అనంతరం భాగ్యనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సందడి సురేందర్ రెడ్డి సలీం నగర్ లో వారి నివాసంలో అల్పాహారం తీసుకోనున్నారు.
ఉదయం 10 గంటలకు లోక్సభ కోర్ కమిటీ సమావేశం దిల్సుఖ్ నగర్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్ లో జరగనున్నది.
11:30 గంటలకు దివ్యాంగుల తో సమావేశం ఐఎస్ సదన్, వినయ్ నగర్ కమ్యూనిటీ హాల్, సైదాబాద్ లో జరగనున్నది.
మధ్యాహ్నం ఒంటిగంటకు వినయ్ నగర్ కమ్యూనిటీ హాల్, ఐఎస్ సదన్, సైదాబాద్ లో విలేకరుల సమావేశంలో పాల్గొంటారు.
సాయంత్రం నాలుగున్నర గంటలకు కరోనా కారణంగా మరణించిన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సభ్యులు శ్రీ హరి రాఘవేంద్రరావు, యువ మోర్చా నాయకులు శ్రీ చంద్రశేఖర్ యాదవ్ గార్ల కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.
సాయంత్రం ఐదున్నర గంటలకు నాంపల్లి రైల్వే స్టేషన్ సందర్శించనున్నారు.
సాయంత్రం ఏడు గంటలకు గన్ ఫౌండ్రీ వద్ద వీధి కార్నర్ సమావేశంలో పాల్గొని ప్రసంగిస్తారు.
రేపు రాత్రికి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి బెంగళూరు బయలుదేరి వెళ్తారు
ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & లోక్సభ ప్రవాస్ యోజన రాష్ట్ర కన్వీనర్ శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, భాగ్యనగర్ జిల్లా అధ్యక్షులు సంరెడ్డి సురేందర్ రెడ్డి, గోల్కొండ జిల్లా అధ్యక్షులు పాండు యాదవ్ తదితరులు పాల్గొంటారని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి & పార్లమెంట్ ప్రవాసి యోజన రాష్ట్ర కన్వీనర్ గుగుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు.