చిన్నారి పై అత్యాచారం చేసిన రజని కుమార్ ని నడి రోడ్డు పైన ఉరి తీయాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బంజారాహిల్స్ లోని డిఏవి పబ్లిక్ స్కూల్ లో 4 ఏండ్ల చిన్నారి పైన అత్యాచారం చేసిన ప్రిన్సిపాల్ మాధవి డ్రైవర్ రజని కుమార్ ని నడి రోడ్డు పైన ఉరి తీయాలని  మహిళా ప్రతి ఘటన సంఘం అధ్యక్షురాలు ఎన్. నిర్మల ముదిరాజ్ డిమాండ్ చేశారు.గురువారం సికింద్రాబాద్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో హ్యూమన్ రైట్స్ సేవ ఫౌండేషన్  రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కల్పనా రెడ్డి, ప్రముఖ సంఘ సేవకురాలు జ్యోతి, ప్రదాన కార్యదర్శి అనిల్ తో కలిసి మాట్లాడారు. ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం ఎన్నో చట్టాలు తెచ్చినప్పటికి రోజుకు ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసారు. ఇన్ని జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోక పోవడం శోచనీయమన్నారు.

రాజకీయ నాయకుల అండ చూసుకొని ఇలాంటి లం….కొడుకులు  నేరం చేస్తూ బయట ప్రపంచంలో తిరుగుతున్నారు.ఇలాంటివి వారికి కటినమైన శిక్షలు విదించాలని వారు డిమాండ్ చేసారు.లేని పక్షం లో నిందితుడికి శిక్ష పడని యెడల మహిళా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద  ఎత్తున ఆందోళన చేపడుతామని వారు హెచ్చారించారు. ప్రభుత్వం మహిళ శిశు రక్షణ విషయంలో మరింత కఠినమైన చట్టం చేయాలని నిందితుడిని కఠినంగా శిక్షించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ , హోమ్ మినిష్టర్, న్యాయస్థానాలకు  విజ్ఞప్తి చేసారు.

Leave A Reply

Your email address will not be published.