22న పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్న స్పీకర్ పోచారం
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి గారు అక్టోబర్ 22, 2022న బాన్సువాడ నియోజకవర్గం పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం 9.30 కి పాత బాన్సువాడ చావడి వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం, డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణ లబ్ధిదారులకు బిల్లుల చెక్కులు పంపిణీ. 11 గంటలకు వర్ని మార్కెట్ కమిటీలోవరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. మద్యాహ్నం 1 గంటలకు బీర్కూరు AMC లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం. సాయంత్రం 4 గం.లకు నస్రుల్లాబాద్ లో డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణ లబ్ధిదారులకు బిల్లుల చెక్కులు పంపిణీ చేయనున్నారు.