రాజీనామా దెబ్బకు ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ మునుగోడు కు వచ్చిండు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నా రాజీనామా దెబ్బకు ఫామ్ హౌస్ లో పండుకున్న కేసీఆర్ మునుగోడు కు వచ్చిండు, నమ్మించే తెలివితేటలు కొన్ని రోజులవరికే నడుస్తాయి. ఆ తర్వాత ఎవరు నమ్మరు అని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు. బిజెపి అంటే ఒక యుద్ధ నౌక ఒక బండి సంజయ్ ఒక రఘునందన్ రావు ఒక రాజాసింగ్ లాంటి క్షిపణలు ఉన్న యుద్ధ నౌక కెసిఆర్ కు అహంకారం ఎక్కువై నన్ను ఎవరు ప్రశ్నించొద్దనే ఉద్దేశంతో 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొన్నాడు

ఆ రోజు నుంచి నేను అనుకుంటున్నా ఈ కేసీఆర్ని గద్దె దించాలి, టిఆర్ఎస్ ని బొంద పెట్టాలని 8 ఏళ్లలో అధికారాన్ని అడ్డమెట్టుకొని లక్ష కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దోచుకుంది నారాయణపూర్ లో ఇల్లులు వచ్చాయా రోడ్లు వచ్చాయా ఎవరికోసం వచ్చింది తెలంగాణ కెసిఆర్ కుటుంబం కోసమా తెలంగాణ వచ్చింది వెయ్యి మంది పిల్లలు ప్రాణ త్యాగం చేసింది కేసీఆర్ కుటుంబం కోసమా కుటుంబ పాలనకు వ్యతిరేకంగా రఘునందన్, వివేక్ వెంకటస్వామి, బండి సంజయ్ లు పోరాడుతున్నారు .ఇటీవల బూర నర్సయ్య గౌడ్ కూడా ఆ పోరాటానికి మద్దతుగా వచ్చారు, బండి సంజయ్ నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ దూసుకుపోతుంది మూడున్నర యేండ్లు అసెంబ్లీలో మాట్లాడితే ఒక రూపాయి కూడా ఇవ్వలే నువ్వు నీ అయ్యా… ఇప్పుడొచ్చి గట్టుప్పల్ లో మాజీ సర్పంచ్ని అన్నా రా అన్నా రా అని బతిలాడుతున్నావ్ అన్నారు. అప్పుడు తెలంగాణ కోసం నువ్వు ఎన్నిసార్లు రాజీనామా చేసి ఉప ఎన్నికలకు వచ్చినావో…ఇప్పుడు నిన్ను బొంద పెట్టడానికి రాజీనామా చేసి ఉప ఎన్నిక వచ్చింది. రాజగోపాల్ రెడ్డి నువ్వు ఓడ కొట్టడానికి ఇక్కడికి వచ్చిన ఎమ్మెల్యేలకు వాళ్ళ నియోజకవర్గాల్లో అభివృద్ధి చేసుకోవడానికి కేసీఆర్ దగ్గర నిధులు తీసుకొచ్చే దమ్ముందా ? నిజాం నిరంకుశ పాలను ఎదిరించిన గడ్డ ఇది, ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదే లేదు పేద ప్రజల గురించి పట్టించుకోని నిన్ను గద్దె దింపుతాం అప్పుల పాలైన తెలంగాణను గాడిలో పెట్టడానికి మోడీ అమిత్ షా ఆధ్వర్యంలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తాం అన్నారు. 15 రోజులు కష్టపడండి ఆరో తారీకు వచ్చే విజయం భారతదేశం అంత ప్రతిధ్వనిస్తుంది అని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.