దామరంచలో క్రీడా ప్రాంగణ స్థలాన్ని పరిశీలించిన ఎంపీడీవో


తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్/ బీర్కూర్ : బీర్కూరు మండలం దామరంచ గ్రామ శివారులో క్రీడా ప్రాంగణ స్థలాన్ని ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలాన్ని శనివారం ఎంపీడీవో భాను ప్రకాష్, స్థానిక సర్పంచ్ విట్టల్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలోనూ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ క్రీడా ప్రాంగణాల్లో వాలీబాల్, షటిల్ అంటే కోర్టులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువకులు ఆటలాడుకునేందుకు అనువైన స్థలాలను ఎంపిక చేస్తున్నామన్నారు. ఒక్కో గ్రామంలో రెండు నుండి మూడు క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఆయన వెంట సర్పంచ్ విట్టల్, ఏపీవో అక్మల్ తదితరులున్నారు.

Leave A Reply

Your email address will not be published.