కేసీఆర్‌ ఎనిమిదేండ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు

.. మంత్రి కొప్పుల

తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్: ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎనిమిదేండ్ల పాలనలో ఎన్నో అద్భుతాలు సృష్టించారని తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా విజనరీతో ముందుకు సాగుతున్న గొప్ప నాయకుడని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన ఎండపల్లి మండలం లో తహసీల్‌ కార్యాలయాన్ని మంత్రి ఎంపీ బోర్లకుంట వెంకటేష్ నేతతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి కొప్పుల మాట్లాడారు.  ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఎండపల్లి మండలాన్ని ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల వస్తుందని ఎవరూ ఊహించలేదని కాని కేసీఆర్‌ నేతృత్వంలో అది సాధ్యం అవుతుందని పేర్కొన్నారు.రాష్ట్రంలో వేలాది మంది పేదలకు ఉచితంగా వైద్యం అందుతుందని వెల్లడించారు. అంబేద్కర్ స్ఫూర్తిగా రెసిడెన్షియల్ స్కూల్స్ నిర్మించగా ఆరు లక్షల మంది విద్యార్థులు ఉచిత విద్యాబోధన పొందుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి నాయక్జడ్పీ చైర్ పర్సన్ దావ వసంతడీసీఎంఎస్ చైర్మన్‌ శ్రీకాంత్ రెడ్డిటీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు పోనుగోటి శ్రీనివాస రావు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.