అట్లూరి రామ్మోహన్ రావు మృతి

.. సంతాపం తెలిపిన బండి సంజయ్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రామోజీరావు సన్నిహితులు, రామోజీ గ్రూప్ సంస్థల ఎండీగా పనిచేసిన అట్లూరి రామ్మోహన్ రావు మృతి చెందారు. ఆయన మృతి పట్ల బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ సంతాపం తెలిపారు.  ఈనాడు దినపత్రిక మేనేజింగ్ డైరక్టర్ గా, రామోజీ గ్రూప్ సంస్థలకు ఎండీగా సుదీర్ఘకాలం సేవలందించిన అట్లూరి రామ్మోహన్ రావు మరణం బాధాకరమన్నారు. ఫిల్మ్ సిటీ నిర్మాణంలో ఆయన సేవలు మరువలేనివన్నారు. అట్లూరి రామ్మోహన్ రావు ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులకు మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.