అభివృద్ధే మా కులం.. సంక్షేమమే మా మతం.. జనహితమే మా అభిమతం

.. టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:  అభివృద్ధే మా కులం.. సంక్షేమమే మా మతం.. జనహితమే మా అభిమతం.. అని టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ స్పష్టం చేశారు. ఎనిమిదేండ్ల కింద తెలంగాణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు కేసీఆర్ చెప్పింది ఒక్కటే. పేదవాడి ముఖంలో చిరునవ్వు చూస్తేనే మన జన్మ ధన్యమైతదని చెప్పారు. కులంమతలం అని చూడలేదు. అభివృద్ధే కులంసంక్షేమమే మతంజనహితమే మన అభిమతం అని చెప్పి ముందుకు పోతున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో నిర్వహించిన లారీ యజమానులడ్రైవర్ల ఆత్మీయ సమ్మేళనంలో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు.ఇవాళ తెలంగాణలో దేశంలో ఎక్కడాలేని సంకక్షేమ పథకాలు అమలవుతున్నాయి. పేదరికమే ప్రతిపాదికగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాం. పారిశ్రామికవేత్తల నుంచి మొదలుకొంటే కార్మికులుశ్రామికుల బాగోగులు చూస్తున్నాం. నాడు ఉద్యమంలో ఉన్న సమయంలో.. మా దోస్తులు అనేవారు. మీకు తెలంగాణ వస్తే రాష్ట్రనాన్ని ముందుకు తీసుకుపోయే దమ్మున్న నాయకత్వం మీకు ఉందాఅని అడిగేవారు. కానీ ఇవాళ చూస్తుంటే ప్రపంచంలో ఉన్న నగరాలను దాటుకొనిమన హైదరాబాద్‌కు వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డు వచ్చింది. అది మన దమ్ము. మన కేసీఆర్ నాయకత్వ పటిమకు ఈ అవార్డు నిదర్శనమని కేటీఆర్ చెప్పారు.ఇవాళ కరెంట్ కోసం తిప్పలు లేదు. విద్యుత్ లేక ఆగమాగం అయిపోయిన పరిశ్రమలకువ్యవసాయానికిగృహ వినియోగానికి ఇవాళ నాణ్యమైన 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. కరెంట్తాగునీటి సమస్య పరిష్కరించాం. దశాబ్దాల నుంచి ఉన్న ఫ్లోరోసిస్ వ్యాధిని రూపుమాపాం. వ్యవసాయం పండుగలా మారింది. మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగు చేసుకున్నాం. కాళేశ్వరం కట్టాం. పాలమూరు పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఇవాళ మూడున్నర కోట్ల ధాన్యం ఉత్పత్తి చేస్తున్నాం. ఇది కదా తెలంగాణ దమ్ము అని కేటీఆర్ స్పష్టం చేశారు.

Leave A Reply

Your email address will not be published.