విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో భారీ అగ్నిప్రమాదం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: దీపావళి ముందు జరుగుతున్న ప్రమాదాలు హడలెత్తిస్తున్నాయి. క్రాకర్స్ స్టాల్స్‌లో వరుస ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిన్న రాత్రి తిరుపతిలో, ఇవాళ విజయవాడలో క్రాకర్స్ స్టాల్స్‌లో అగ్ని ప్రమాదాలు జరిగాయి. విజయవాడ జింఖానా గ్రౌండ్స్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. క్రాకర్స్ షాపుల్లో భారీగా మంటలు ఎగిసి పడ్డాయి. స్టాల్స్‌లోని క్రాకర్స్ అగ్నికి ఆహుతయ్యాయి. అగ్ని ప్రమాదంతో భయంతో వ్యాపారులు , ప్రజలు పరుగులు తీసారు. సమీపంలో పెట్రోల్ బంక్ ఉండటంతో ఆందోళన నెలకొంది. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నించారు.

Leave A Reply

Your email address will not be published.