కీర్తి పురస్కార గ్రహీత రఘుశ్రీ కి ఘన సత్కారం
ప్రముఖ కవి మానస ఆర్ట్ థియేటర్స్ వ్యవస్థాపక కార్యదర్శి కవి శ్రీ రఘు శ్రీ కి తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ సాహిత్య సంస్థ నిర్వాకునిగా ఎంపిక చేసి కీర్తి పురస్కారాన్ని ప్రధాన చేసింది. ఈ సందర్భంగా మానస ఆర్ట్ థియేటర్ సంస్థ కార్యవర్గ సభ్యులు, మిత్రబృందం కలిసి త్యాగరాయగణ సభ లో ఆత్మీయ సత్కారాన్ని నిర్వహించారు. ప్రముఖ విద్యావేత్త డాక్టర్ బి జయ రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ కె.వి రమణాచారి ముఖ్యఅతిథిగా విచ్చేసి కవి శ్రీ రఘుశ్రీని ఆత్మీయంగా సత్కరించారు. సంస్థ అధ్యక్షులు బండారుపల్లి రామచంద్రారావు, ఉపాధ్యక్షులు డాక్టర్ లలిత వాణి, పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ కవి ఇనుగంటి నవనీత రావు, నవల రచయిత వీరపూర్ణ చందర్రావు, డాక్టర్ నూరి రాజేశ్వరరావు, చినుకు మూర్తి తదితరులు పాల్గొన్నారు.