బిజెపికి గుడ్ బై చెప్పిన రాపోలు

తెలంగాణ జ్యోతి, వెబ్ న్యూస్: తెలంగాణలో బీజేపీకి మరో షాక్ తగిలింది. ఇప్పటి వరకు ఆ పార్టీలో ఉన్న మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ బీజేపీకి గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారు. ఆదివారం ఆయన సీఎం కేసీఆర్ ను కలిసి టీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలిపారు. ఆనంద భాస్కర్ సోమవారం టీఆర్ఎస్లో చేరనున్నారు. ఇంతకుముందు స్వామి గౌడ్, దాసోజ్ శ్రవణ్, భిక్షమయ్య గౌడ్ తదితరులు బీజేపీని వీడి టీఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే.

Leave A Reply

Your email address will not be published.