హోటల్ పై ఉగ్రవాదుల దాడి.. 9 మంది దుర్మరణం

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: సోమాలియా లోని పోర్ట్సిటీ కిస్మయో ప్రాంతంలోని హోటల్పై ఉగ్రదాడి జరిగింది. ఈ దాడిలో 9 మంది మరణించగా, 49 మందికి గాయాలయ్యాయి. ఈ దాడి తామే చేసినట్ల ఆల్ షబాబ్ గ్రూప్ పేర్కొంది. రాత్రి 9:45 గంటల సమయంలో పేలుడు పదార్థాలతో ఉన్న కారు హోటల్లోకి దూసుకురావడంతో దాడి మొదలైంది. రక్షణ దళాలు ముగ్గురు దుండగులను హతమార్చాయని, మరొకరు పేలుడులో మరణించాడని అధికారులు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.