విద్వేష రాజ‌కీయాల‌ పట్ల యువ‌త అప్ర‌మ‌త్తంగా ఉండాలి

ముఖ్యమంత్రి కేసీఆర్

అంద‌ర్నీ క‌లుపుకుపోయే ఈ దేశంలో విద్వేషాలు ర‌గ‌లొద్దు.. విద్వేష రాజ‌కీయాల‌ను గ్ర‌హించి యువ‌త అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ సూచించారు. వ‌రంగ‌ల్‌లో ప్ర‌తిమ‌  మెడిక‌ల్ కాలేజీ ప్రారంభోత్స‌వం అనంత‌రం అక్క‌డ ఏర్పాటు చేసిన స‌భ‌లో కేసీఆర్ ప్ర‌సంగించారు.ఈ దేశం చాలా గొప్ప దేశం. స‌హ‌న‌శీల‌త దేశం. అవ‌స‌ర‌మైన సంద‌ర్భాల్లో త్యాగాల‌కు సిద్ధ‌ప‌డే దేశం. పోరాటాల‌తో ముందుకు పోయే దేశం. అంద‌ర్నీ క‌లుపుకుపోయేటటువంటి అద్భుతమైన దేశం. పూల‌బోకే లాంటి గొప్ప దేశం. ప్రేమ‌తో బ‌తికేట‌టువంటి ఈ దేశంలో కొద్ది మంది దుర్మార్గులు.. వాళ్ల స్వార్థ‌నీచ ప్ర‌యోజ‌నాల కోసం విష‌బీజాలు నాటే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అది ఏ ర‌కంగా కూడా స‌మ‌ర్థ‌నీయం కాదు.. ఏ ర‌కంగా కూడా స‌మాజానికి మంచిది కాదు. నా వ‌య‌సు అయిపోతుంది. 68 ఏండ్లు కంప్లీట్ కావొస్తుంది. భ‌విష్య‌త్ మీది.. ఈ భార‌త‌దేశం మీది. విద్యార్థులుగాయువ‌కులుగా ఈ దేశాన్ని గొప్ప దేశంగా తీర్చిదిద్దుకునే క‌ర్తవ్యం మీ మీద ఉంట‌ది. మెడిక‌ల్ విద్య‌తో పాటు సామాజిక విద్య‌ను కూడా పెంపొందించుకోవాలి. ప‌రిస్థితుల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు గ‌మ‌నిస్తూ ముందుకు పోవాలి అని కేసీఆర్ సూచించారు.

Leave A Reply

Your email address will not be published.