చిత్తూరు లో లోన్ యాప్ మోసగాళ్ల అరెస్ట్
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్: చిత్తూరులో ప్రభుత్వ అనుమతులు లేకుండా లోన్ యాప్లలో నగదు తీసుకున్న వారిని పదే పదే ఈఎంఐలు చెల్లించాలని ఒత్తడి చేస్తూ, చెల్లించకపోతే బాధితుల ఫోటోలను మార్ఫింగ్ చేసి, కుటుంబ సభ్యులకు పంపిస్తామని బెదిరించి, లక్షలకు లక్షలు వసూలు చేసిన నలుగురు మోసగాళ్లను అరెస్ట్ చేశామని డీఎస్పీ సుధాకర్ రెడ్డి తెలిపారు. వారి నుంచి రూ.20 వేల నగదు, ల్యాప్టాప్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు.