రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:

టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ శ్రేణులకు ఆదివారం బహిరంగ లేఖ రాశారు.

నికార్సైన కాంగ్రెసోడా మునుగోడుకు కదలిరా అని పిలుపునిచ్చారు, మునుగోడును కేవలం ఒక ఉప ఎన్నికగానే చూడలేం. కాంగ్రెస్ ను అంతం చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ కుట్ర చేస్తిన్నాయి. దుష్టశక్తులన్నీ ఏకమై మనల్ని ఒంటరిని చేయాలనుకుంటున్నాయి కాంగ్రెస్ బిక్షతో ఎదిగివాళ్లే వెన్నుపోటు పొడిచారు. సీఆర్పీఎఫ్, ఎలక్షన్ కమిషన్ లను బీజేపీ దుర్వినియోగం చేస్తోందిరాష్ట్ర పోలీసులు, స్థానిక అధికార గణాన్ని టీఆర్ఎస్ విచ్చలవిడిగా ఉపయోగిస్తోంది. అడుగడుగున్నా ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పవిత్రమైన యాదగిరి గుట్ట నర్సింహస్వామి దేవస్థానాన్ని రాజకీయ లబ్ధికి వేదికగా మార్చడం దీనికి పరాకాష్ఠ. ఆడబిడ్డ అని చూడకుండా పాల్వాయి స్రవంతి పై రాళ్ల దాడులకు తెగబడ్డారన్నారు.మన కుటుంబ సభ్యులపై దాడి జరుగుతుంటే నిశ్చేష్ఠులుగా ఉందామా!? తెలంగాణ అస్థిత్వానికి ప్రాణం పోసిన తల్లి సోనియమ్మకే ద్రోహం చేస్తుంటే ఊరుకుందామా?

కాంగ్రెస్ ఏం పాపం చేసిందని ఈ కుట్రలు!?

60 ఏండ్ల ఆకాంక్షను నిజం చేయడమే కాంగ్రెస్ చేసిన నేరమా!?

పోరాటాల చరిత్రకు వారసులమైన మనం బాంఛన్ దొరా అని బానిసలవుదామా…

నిప్పుకణికలై నిటారుగా నిలబడి కొట్లాడుదామా తేల్చుకోవాల్సిన సమయం ఇది.

తెలంగాణ నలు మూలల నుండి కాంగ్రెస్ శ్రేణులు ఉన్నపళంగా కదలి రండి.

మునుగోడు లో కలిసి కదం తొక్కుదాం.

ప్రాణమో… ప్రజాస్వామ్యమో తాడోపేడో తేల్చుకుందాం.

మునుగోడులో కాంగ్రెస్ జెండా ఎగరేద్దాం.

ఈ క్షణమే కదలండి… మీ కోసం మునుగోడులో ఎదురు చూస్తుంటా.

కులాలు, మాతాలకు అతీతంగా తెలంగాణ నలుమూలల నుంచి మునుగోడుకు తరలిరండి అంటూ పిలుపునిచ్చారు

Leave A Reply

Your email address will not be published.