రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ నగరంలోని వనస్థలిపురం పనామా దగ్గర అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన స్పోర్ట్స్‌ బైక్ అదుపుతప్పి కారును వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెనుక కూర్చున్న యువకుడు మృతి చెందగా.. డ్రైవ్ చేసిన యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని తీవ్రంగా గాయపడిన వ్యక్తిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Leave A Reply

Your email address will not be published.