మునుగోడులో ప్రతిపక్షాల డ్రామాలు స్టార్ట్ అయ్యాయి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడులో ప్రతిపక్షాల డ్రామాలు స్టార్ట్ అయ్యాయని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ భవన్ లో మంగళవారం పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. సానుభూతి కోసం చేతికి పట్టీలు, దుబ్బాక హుజురాబాద్ లలో ఇలాగే జరిగింది. ఇవ్వాళ జ్వరం, రేపు దాడులు అంటూ ఏడుపులు డ్రామాలు చేస్తారు. కేసీఆర్ నాయకత్వంలో ఫ్లోరెడ్ పూర్తిగా పోయింది. మునుగోడు ప్రజలు సానుభూతి డ్రామాలను నమ్మకండి డ్రామాలను నమ్మితే నష్టపోయేది మునుగోడు ప్రజలే జనరల్ ఎన్నికల లోపు అభివృద్ధిలో మార్పు కనిపించకపోతే ప్రజలు అప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా స్వీకరిస్తాం. వాళ్లంతట వాళ్లే దాడులు చేయించుకొని ఏడ్చుతారు. ఒకవైపు రాజగోపాల్ రెడ్డికి జ్వరం, మరోవైపు కాంగ్రెస్ అభ్యర్థి ఏడుపు. మునుగొడులో టీఆరెస్ స్పష్టమైన మెజారితో గెలుస్తోంది.  ప్రతిపక్ష ఎమ్మెల్యే మునుగొడులో ఉన్నా ప్రభుత్వ పథకాలు అన్ని అందినాయి.  మునుగొడులో ఉన్నది కూడా తెలంగాణ సమాజమే అన్నారు. బీజేపీకి మిగిలింది ఇక మూడు రోజులే..కాబట్టి సెంటిమెంట్ రగిలించడానికి అనేక డ్రామాలు ప్రయత్నాలు.  రాజకీయ పార్టీగా ప్రతి ఎన్నికను ఛాలెంజ్ గా తీసుకుంటాం. మేము కాంట్రాక్టర్ల కోసం రాజకీయం చేసే వాళ్ళం కాదు. కుట్రలు, కుతంత్రాలు మాకు అవసరం లేదు అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, క్యామ మల్లేశ్, MLC లు ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, MLA లు కాలేరు వెంకటేష్, ముఠా గోపాల్, షీప్ అండ్ గోట్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజ్ యాదవ్, మాజీ MLC శ్రీనివాస్ రెడ్డి, TRS రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.