కాంగ్రెస్ హక్కులు కల్పిస్తామంటే టీఆరెస్ హక్కులను కాలరాస్తోంది

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కాంగ్రెస్ హక్కులు కల్పిస్తామంటే టీఆరెస్ హక్కులను కాలరాస్తోందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. మంగళవారం కడీలబావి తండాలో ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ లంబాడీ సోదరులను ఎస్టీలలో చేర్చాలని ఆనాడు జైపాల్ రెడ్డి ప్రయత్నించారు. లంబాడీల దుస్థితి చూసి ఇందిరాగాంధీ వారిని ఎస్టీలలో చేర్చారు. గిరిజనులకు చదువుల్లో, చట్టసభల్లో అవకాశం కల్పించిన ఘనత కాంగ్రెస్ దే వేలాది ఎకరాల భూములను గిరిజనులకు పట్టాలిచిన ఘనత కాంగ్రెస్ పార్టీది కేసీఆర్ సీఎం అయ్యాక మీ భూములపై కన్నేశారు. గిరిజనుల భూములను గుంజుకుని సినిమా వాళ్లకు కట్టబెట్టాలని చూస్తున్నారు. మీ భూములను  గుంజుకునేందుకు  మీ భూములను అమ్ముకునే హక్కు కల్పించాలని వరంగల్ రైతు డిక్లరేషన్ చేసింది. కాంగ్రెస్ హక్కులు కల్పిస్తామంటే టీఆరెస్ హక్కులను కాలరాస్తోంది. మీ భూములను గద్దల్లా తన్నుకు పోవాలని చూస్తున్నారు. మల్లన్న సాగర్, డిండి, శివన్నగూడెం భూముల్లా మీ భూములను గుంజుకోవలనుకుంటున్నారు. అందుకే మీరు ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఎవరేం ఇచ్చినా తీసుకోండి.. ఓటు కాంగ్రెస్ కు వేయండి. మీ ఓట్లను అమ్ముకున్నోడు మీ భూములను అమ్ముకోడా ఆలోచించండి. మీ భూములు మీకు అమ్ముకునే హక్కు రావాలంటే కాంగ్రెస్ గెలవాలి. కాంగ్రెస్ ను లేకుండా చేయాలని కుట్ర జరుగుతోంది. అమ్ముడుపోయిన సన్నాసులు కాంగ్రెస్ కార్యకర్తలపై దాడులు  చేస్తున్నారు. వేలాదిగా మునుగోడుకు తరలిరండి మన వాళ్లపై దాడి చేస్తే తిప్పికొట్టండి. రాబోయే వారం రోజులు మునుగోడు కాంగ్రెస్ నేతలకు అండగా నిలవండి ఎవరు ఎదురొచ్చినా మునుగోడులో కాంగ్రెస్ ను గెలిపించుకుందాం అని పిలుపునిచ్చారు.

Leave A Reply

Your email address will not be published.