శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో అధికారులు జలాశయం 10 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. స్పిల్‌వే ద్వారా 2.79 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలానికి 2.71 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుంది. జలాశయం పూర్తి నీటిమట్టం 885 అడుగులు కాగా 884.70 అడుగుల వరకు నీరు ఉంది. పూర్తి నీటి నిల్వ 215.80 టీఎంసీలు కాగా ప్రస్తుతం 213.88 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం కుడి, ఎడమ జల విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్పత్తిని కొనసాగిస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.