సీపీఐ, సీపీఎం నాయకులతో మంత్రి ఎర్రబెల్లి భేటీ

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల్లో భాగంగా చుండూరు మున్సిపాలిటీలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తుండగా సిపిఐ, సిపిఎం నాయకులు కూడా ప్రచారం చేస్తూ ఎదురవగా వారితో మంత్రి కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా మంత్రి వారితో అక్కడ జరుగుతున్న ప్రచార సరళిని అడిగి తెలుసుకున్నారు. ప్రచారం ఎలా చేస్తున్నారు? ప్రజల స్పందన ఎలా వుందని వారితో ఆరా తీశారు. ఈ సందర్భంగా TRS పార్టీ చేస్తున్న అభివృద్ది పథకాలను ప్రజల్లోకి మరింత తీసుకెళ్లాలని వారికి సూచించారు. అలాగే బీజేపీ పార్టీ రాష్ట్రానికి చేస్తున్న అన్యాయాలను ప్రజలకు వివరించి ఈ ఎన్నికల్లో వారికి గట్టి బుద్ది చెప్పాలని ప్రజలకు చెప్పాలి అన్నారు.

Leave A Reply

Your email address will not be published.