మునుగొడులో పోలీసుల సెర్చింగ్ ఆపరేషన్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల వేళ పోలీసులు సంచలన ఆపరేషన్ చేపట్టారు. హైదరాబాద్ శివారులోని ఓ ఫాం హౌస్ లో బుధవారం భారీగా డబ్బు మూటలతో నలుగురు పట్టుబడ్డారు. అయితే అదే ఫాం హౌస్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డి ఉండడం సంచలనం రేకెత్తిస్తోంది. తిరుపతికి చెందిన ఓ స్వామీజీ సాయంతో వీరికి డబ్బులు వల వేసినట్లు ప్రచారం సాగుతోంది. దీనిపై పోలీసులు స్పందించాల్సి ఉంది.