PM Modi: షింజో అబె తుది వీడ్కోలుకు హాజరైన ప్రధాని మోదీ
ఇంటర్నెట్డెస్క్: జపాన్ మాజీ ప్రధాని షింజో అబె తుది వీడ్కోలు కార్యక్రమానికి భారత ప్రధాని నరేంద్ర మోదీ హాజరయ్యారు. ఇప్పటికే అబె కుటుంబం ప్రైవేటుగా అంత్యక్రియలను పూర్తి చేసింది. కానీ, ప్రభుత్వం మాత్రం నేడు అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు పలికింది. షింజో చితాభస్మాన్ని టోక్యో హాల్కు తీసుకొచ్చారు. ఇక్కడ వేలమంది ఆయనకు తుది నివాళిని అర్పించారు. 19 తుపాకుల అభివాదాన్ని సమర్పించారు. జపాన్లో అధికారిక లాంఛనాలతో తుది వీడ్కోలు అందుకొన్న రెండో నేతగా అబె నిలిచారు.