భాజపా దిష్టిబొమ్మ దగ్ధం చేసిన తెరాస నేతలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: అధికార దాహంతో, ధన బలంతో, ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా TRS పార్టీ MLA లను కొనుగోలు చేయడానికి ప్రయత్నించి,తెరాస ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించిన BJP దుష్ట వైఖరిని నిరసిస్తూ మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ వద్ద హైదరాబాద్ – విజయవాడ జాతీయ రహదారిపై అర్థరాత్రి BJP దిష్టిబొమ్మను  మంత్రులు శ్రీ ఇంద్రకరణ్ రెడ్డి, గంగుల కమలాకర్, శ్రీనివాస్ గౌడ్, తెరాస ఎమ్మెల్యేలు దహనం చేశారు. భాజపా  తన దుష్ట వైఖరి మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో చిన్న కొండూరు, మందల గూడెం గ్రామాల ఎన్నికల ఇంఛార్జి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ శ్రీ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.