అప్పులతో ఏపీ ఆర్థిక దివాలా తీయడం ఖాయం
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్:
అప్పులతో ఏపీ ఆర్థిక దివాలా తీయడం ఖాయమని ఎంపీ రఘురామకృష్ణరాజు జోస్యం చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పులు పుట్టవనేది నిజమని, సీఎం జగన్ ఆర్థిక ఇబ్బందులు లేవనేది అబద్ధమన్నారు. ఒక వ్యక్తి కారణంగా వ్యవస్థలు కుప్పకూలుతున్నాయని విమర్శించారు. జనసేనను అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని, జనసైనికులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రశాంతంగా నడుస్తున్న రైతుల పాదయాత్రను ఆపాలనే కేసు వేశారని తప్పుబట్టారు. మాజీమంత్రి వివేకా హత్య ఎంపీ సీటు కోసం జరిగిందని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల చెప్పారని, దీనిపై తమ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు సాయిరెడ్డికి గుండెపోటు అని చెప్పింది ఎవరు? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.
అప్పులతో ఏపీ ఆర్థిక దివాలా తీయడం ఖాయమని ఎంపీ రఘురామకృష్ణరాజు జోస్యం చెప్పారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ అప్పులు పుట్టవనేది నిజమని, సీఎం జగన్ ఆర్థిక ఇబ్బందులు లేవనేది అబద్ధమన్నారు. ఒక వ్యక్తి కారణంగా వ్యవస్థలు కుప్పకూలుతున్నాయని విమర్శించారు. జనసేనను అడ్డుకోవాలని వైసీపీ ప్రయత్నిస్తోందని, జనసైనికులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. ప్రశాంతంగా నడుస్తున్న రైతుల పాదయాత్రను ఆపాలనే కేసు వేశారని తప్పుబట్టారు. మాజీమంత్రి వివేకా హత్య ఎంపీ సీటు కోసం జరిగిందని వైఎస్ఆర్టీపీ అధినేత్రి షర్మిల చెప్పారని, దీనిపై తమ పార్టీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు సాయిరెడ్డికి గుండెపోటు అని చెప్పింది ఎవరు? అని రఘురామకృష్ణరాజు ప్రశ్నించారు.