విద్య, వైద్యానికి వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం
తెలంగాణ జ్యోతివెబ్ /వెబ్ న్యూస్: విద్య, వైద్యానికి వైసీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. తమ పిల్లలను తామే చదివించుకోవాలనే ఉద్దేశంతో జగన్ పిల్లల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలో డబ్బులు వేస్తున్నారని గుర్తు చేశారు. పిల్లలను ఉన్నత చదువులు చదివించగలమన్న నమ్మకాన్నితల్లిదండ్రులకు జగన్ కలిగించారని చెప్పారు. ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం కూడా అందిస్తున్నామని సజ్జల తెలిపారు.