ఉరి వేసుకుని బాలిక ఆత్మహత్య

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని షేర్ శంకర్ తాండా గ్రామానికి చెందిన కాట్రోత్ నందిని (11) అనే బాలిక గురువారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. షేర్ శంకర్ తండాకు చెందిన కాట్రోత్ భాస్కర్, సోని దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఒక కొడుకు ఉన్నారు. పెద్ద కూతురు నందిని భిక్కనూరు మండలంలోని జంగంపల్లి గ్రామ శివారులోని కేజీబీవీ పాఠశాలలో ఆరవ తరగతి చదువుతోంది. దసరా సెలవుల నుంచి ఇంట్లోనే ఉంటుంది. గురువారం ఇంట్లో చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి తండ్రి భాస్కర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై రాజు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.