కాంగ్రెస్ లో చేరిన సీపీఎం నాయకుడు పంపర మల్లేశం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: వరంగల్ ఉమ్మడి జిల్లా సీపీఎం నాయకుడు పంపర మల్లేశం మాజీ పిసిసి అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య సమక్షంలో శుక్రవారం  కాంగ్రెస్ లో చేరారు. జనగామ జిల్లా ఫిషర్మన్ సొసైటీ అధ్యక్షుడు గా ఉన్న పంపర మల్లేశం మాట్లాడుతూ సీపీఎం లో 35 సంవత్సరాలు గా సీపీఎం లో పని చేస్తున్న కమ్మునిస్ట్ పార్టీ మునుగోడు ఉప ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం లు అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ సపోర్ట్ చేయడం వల్ల కార్యకర్తలు మనస్తాపం చెందారని, కమ్మునిస్ట్ పార్టీ మతతత్వ బీజేపీ ని ఓడించాలంటే టీఆరెస్ కి సపోర్ట్ చేస్తేనే ఓడించగలం అన్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ తో కలిసి వెళ్తే బీజేపీ ని కొట్టగలమా..లేక చిన్న రాష్ట్రంలో ఉన్న పార్టీతో వెళ్తే కొట్టగలమా  అని ప్రశ్నించారు. మునుగోడు లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని, సీపీఎం పార్టీకి రాజీనామా చేసాను ఇక జనగామ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఏ పని అప్పగించిన చేస్తాను అని ఆయన అన్నారు.

Leave A Reply

Your email address will not be published.