రోడ్డు ప్రమాదంలో బాన్సువాడ వాసులు మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్న వారి కారు రోడ్డు ప్రమాదానికి గురై ఇద్దరూ బాన్సువాడ వాసులు మృతి చెందారు వివరాల్లోకి వెళ్తే బాన్సువాడ పట్టణం లోని 10 వ వార్డు శాంతినగర్ కాలనీలో నివాసం ఉంటున్న మెరిగే ప్రకాష్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం తిరుపతికి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు గద్వాల దగ్గర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ప్రకాష్ భార్య, కూతురు అక్కడికక్కడే చనిపోయారు.
ఈ ప్రమాదం గురించి తెలిసిన వెంటనే శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కర్నూలు కలెక్టర్, మాట్లాడి ప్రకాష్ గారికి మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. అలాగే గద్వాల ఎమ్మెల్యేతో మాట్లాడి వారి పోస్టుమార్టం గురించి మాట్లాడడం జరిగింది.

Leave A Reply

Your email address will not be published.