ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రజలు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ సదాశివ సూచించారు. ప్రజల వద్దకు ఆర్టీసీ ప్రోగ్రాంలో భాగంగా నసురుల్లాబాద్ మండలంలోని సంగెం గ్రామంలో గ్రామస్తులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా సర్పంచ్ లక్ష్మి విట్టల్ మాట్లాడుతూ బాన్సువాడ నిజామాబాద్ ప్రధాన రహదారికి తమ గ్రామం చాలా దూరంలో ఉందని, తమ గ్రామానికి చెందిన ప్రయాణికుల సౌకర్యార్థం రోజుకు మూడు ట్రిప్పులు అదనంగా బస్సు సర్వీసులు పెంచాలని ఆమె డిపో మేనేజర్ కు విజ్ఞప్తి చేశారు. గ్రామ ప్రయాణికుల, విద్యార్థుల సౌకర్యార్థం తమ గ్రామానికి ప్రతిరోజు ఆర్టిసి బస్సును మూడు ట్రిప్పులు పెంచాలని విజ్ఞప్తి చేశారు. డిపో మేనేజర్ స్పందించి  తప్పకుండా ప్రతిరోజు ఆర్టీసీ బస్సును సెంగెం గ్రామానికి మూడు ట్రిప్పులు పంపిస్తామని గ్రామస్తుల సమక్షంలో సర్పంచ్ కు సుముఖత వ్యక్తం చేశారు.

Leave A Reply

Your email address will not be published.