రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఛాంపియన్ షిప్ కు కొత్తాబాది విద్యార్ధి ఎంపిక

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర స్థాయి వాలీబాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు కామారెడ్డి జిల్లా కొత్త బాధి గ్రామానికి చెందిన కడావత్ పావని ఎంపికైనది. ఈమె శ్రీరామ్ నారాయణ ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. ఈనెల 28 నుండి 30 వరకు ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగే జూనియర్ వాలీబాల్ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొననున్నారు. పావనిని కళాశాల ప్రిన్సిపల్, ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Leave A Reply

Your email address will not be published.