నేడు రెండు పడకల లబ్దిదారులకు చెక్కులు పంపిణీ చేయనున్న స్పీకర్ పోచారం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి నేడు శనివారం బాన్సువాడ నియోజకవర్గం పరిధి లోని డబుల్ బెడ్ రూం ఇళ్ళ నిర్మాణ లబ్ధిదారులకు బిల్లు చెక్కులను పంపిణీ చేయనున్నారు. ఇందులో భాగంగా  మధ్యాహ్నం  2 గంటలకు నిజామాబాద్ జిల్లా పరిధిలోని కోటగిరి, రుద్రూరు, వర్ని, మోస్ర, చందూరు మండలాల లబ్ధిదారులకు రుద్రూరు లోని శశిరేఖ గార్డెన్ లో, సాయంత్రం 4 గంటలకు కామారెడ్డి జిల్లా పరిధిలోని బాన్సువాడ మున్సిపాలిటీ, బాన్సువాడ గ్రామీణ మండలం, బీర్కూరు, నస్రుల్లాబాద్ మండలాల లబ్ధిదారులకు బాన్సువాడ పట్టణంలోని మీనా గార్డెన్ లో చెక్కులు పంపిణీ చేయనున్నారు.

Leave A Reply

Your email address will not be published.