తన తండ్రి స్ఫూర్తితో ప్రజలకు సేవ చేస్తా

.. మునుగోడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పాల్వాయి స్రవంతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మునుగోడు: ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పనిచేసే పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే ఏ ఆపద వచ్చినా అండగా నిలుస్తారని కాంగ్రెస్‌ అభ్యర్థిని పాల్వాయి స్రవంతి అన్నారు. ధన బలం చూసి ఓటును అమ్ముకుంటే భవిష్యత్‌ రోజుల్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందన్నారు. తన తండ్రి దివంగత గోవర్ధన్‌రెడ్డి ఆస్తులు ఇవ్వకపోయినా గుండెనిండా ధైర్యమిచ్చారని.. ఆ ధైర్యంతోనే ఈ ఉప ఎన్నికలో నిలబడ్డానని, ఆడబిడ్డగా ఆశీర్వదించి ఒక్కసారి అవకాశం ఇచ్చి మునుగోడు ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. మునుగోడు మండలం చీకటిమామిడి గ్రామంలో శనివారం ప్రచార కార్యక్రమం నిర్వహించారు. 2018 ఎన్నికలో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే రూ.18 వేల కోట్ల కాంట్రాక్టు కోసం కాంగ్రెస్‌ పార్టీని మోసం చేసి భాజపాలోకి వెళ్లారని..మళ్లీ ఈ ఎన్నికలో ప్రజలను ఓటు అడిగే హక్కు ఎక్కడిదన్నారు. తెరాస ప్రభుత్వం తెలంగాణను బంగారు తెలంగాణ చేస్తానని తాగుబోతుల తెలంగాణ చేశారని ఆరోపించారు. ప్రతి గ్రామంలో బడి, గుడిని కట్టించలేదు కానీ గల్లీగల్లీకో బెల్టు దుకాణాన్ని పెట్టినట్లు ఆరోపించారు. ఈ ఎన్నికలో మద్యం పోసి యువతను చెడగొడుతున్నారని మండిపడ్డారు. ఈ ఎన్నికలో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు.

Leave A Reply

Your email address will not be published.